ట్విట్టర్ కు షాక్ ఇచ్చిన కేంద్రం.. వచ్చే నెల 4 వరకే డెడ్ లైన్..

-

జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమల్లొకి రానున్న సంగతి తెలిసిందే..కాగా, ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ కు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది.ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలన్నింటిని తప్పక పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది…ఇందుకు సంభందించి వచ్చే నెల 4 వరకూ డెడ్ లైన్ ను ఇచ్చింది..ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ జూన్ 27న నోటీసులు జారీ చేసింది. అయితే కేంద్రం పంపిన నోటీసులను ట్విట్టర్ పట్టించుకోలేదు.

ఇక కేంద్రం ట్విట్టర్‌కు తుది నోటీసులు ఇచ్చింది. మరోసారి గడువు పెంచేది లేదని స్పష్టం చేసింది. ఇదే ఆఖరిదని తేల్చిచెప్పింది. ఆదేశించిన గడువులోగా ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయని పక్షంలో ట్విటర్ అన్ని హక్కులను కోల్పోతారని హెచ్చరించినట్లు తెలుస్తుంది.. ట్విట్టర్ పోస్టులకు బాధ్యత వహించాల్సిందిగా కేంద్రం సూచించింది. అంతర్జాతీయ న్యాయవాద గ్రూప్ ఫ్రీడమ్ హౌస్, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, రైతు ఉద్యమానికి మద్దతు పలికిన ట్విటర్‌ అకౌంట్లను, కొన్ని ట్వీట్‌లను బ్లాక్ చేయాలని 2021లో ప్రభుత్వం ట్విటర్‌ను కోరింది.

అయితే, 80కి పైగా ట్విటర్‌ అకౌంట్లను బ్లాక్‌ చేశామని ట్విట్టర్ తేల్చిచెప్పింది. ఆయా అకౌంట్లకు సంబంధించిన జాబితాను జూన్ 26న కేంద్రానికి సమర్పించింది. ట్విటర్‌ పాటించాల్సిన ఆర్డర్‌లు ఇంకా ఉన్నాయని తెలిపింది. జూలై 4 మాత్రమే చివరి గడువని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి..కానీ, ట్విట్టర్ మాత్రం పట్టించుకోలేదు..

Read more RELATED
Recommended to you

Latest news