మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు…కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు వీరే!

-

మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సర్వ శక్తులను ఒడ్డుతోంది. ఈ క్రమంలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తాజాగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, సిద్ధరామయ్య, జగదీశ్ శెట్టార్, శశిథరూర్, కేసీ వేణుగోపాల్, జైరామ్ రమేశ్, మునియప్ప, జి.పరమేశ్వర, ఎంబీ పాటిల్, హరిప్రసాద్, రణదీప్ సింగ్ సుర్జేవాలా, డీకే సురేశ్, సతీశ్ జర్కిహోలి, వీరప్ప మొయిలీ, రేవణ్ణ, అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్, రేవంత్ రెడ్డి, కన్నయ్య కుమార్, రాజ్ బబ్బర్, అజారుద్దీన్, దివ్యస్పందన, రమేశ్ చెన్నితాల, పి. చిదంబరం, అశోక్ గెహ్లాట్, భూపేశ్ భాఘేల్, సయ్యద్ నజీర్ హుస్సేన్, రూపా శశిధర్ తదితరులు ఉన్నారు.

Rahul Gandhi granted permanent exemption from appearance in defamation case  by RSS worker in Bhiwandi court

మ‌రోవైపు నామినేష‌న్ల దాఖ‌లు చివ‌రి అంకానికి చేర‌డంతో క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి. అగ్ర నేత‌ల సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ల‌కు నేత‌లు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్ప‌టికే క‌ర్నాట‌క‌లో ఎన్నిక‌ల ర్యాలీల్లో పాల్గొని పార్టీ ప్ర‌చారాన్ని హోరెత్తించారు. మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news