బీజేపీకి బీఆర్ఎస్ “బీ” టీం అని మరోసారి నిరూపితమైంది : రేవంత్‌ రెడ్డి

-

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ‘బీ’ టీమ్ అని మరోసారి నిరూపితమైందని వెల్లడించారు. ఈ క్రమంలో మంగళవారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు రేవంత్. బుధవారం రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ చేపట్టిన ‘సత్యాగ్రహ దీక్ష’ ను నిరుగార్చాలని, ఉచిత విద్యుత్ పై దృష్టి మరల్చాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.

Congress to blow poll bugle from Khammam

12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్‌కు వెళ్లినా తెలుస్తుందని వెల్లడించారు. తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు. ఈ మోసాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సబ్ స్టేషన్ల ముందు కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news