పశుగ్రాసం నిల్వచేసే పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

-

మనదేశంలో అధిక ఆదాయాన్ని ఇచ్చే వాటిలో పాడి పశువులు కూడా ఒకటి.. పాలఉత్పత్తి ఎక్కువే.. అందుకే రైతన్నలు వ్యవసాయం తో పాటు పశువులను కూడా పెంచుతున్నారు.. అయితే పాల ఉత్పత్తి పెరగాలంటే వాటికి ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. ముఖ్యంగా పశుగ్రాసం..మనం దీన్ని రెండు పద్ధతులలో నిల్వ చేసుకోవచ్చు.. ఎలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Silage | Find Out the Difference Between Hay & Silage

పచ్చిమేత పాతర వేసుకోవడం..
వరిగడ్డిని యూరియాతో ఊరవేయడం..

పచ్చిమేతలోని పోషకాలు ఎక్కువగా నష్టం కాకుండా బాగుగా జీర్ణమగునట్లు మగ్గబెట్టిన మేతనే సైలేజి అని పిలుస్తారు. మంచి రకం అయిన సైలేజి బంగారు రంగులో ఉంటుంది. ఒక విధమైన పండిన సువాసన వెదజల్లుతుంది. ఇది కొద్దిగా పులుపుగా ఉన్న పశువులు బాగా తింటాయి. పచ్చిగడ్డి కంటే బాగా జీర్ణం అవుతుంది..ఇందుకు అనువైన పశుగ్రాసాలు చూస్తే..పాల దశలో కంకులు ఉన్న హైబ్రిడ్ మొక్కజొన్న (ముసక జొన్న), జొన్న, రాగి వంటి పశుగ్రాసాలు, బొబ్బర్లు, వేరుశనగ చెట్ల గడ్డి, చెరుకు సొకలు, చిలకడ దుంప (గెణుసు) తీగల రకాలు సైలేజ్ తయారు చేయడానికి పనికి వస్తాయి..

పశుగ్రాసాలను నిల్వ చెయ్యడానికి..

ఇందుకు కొద్దిగా ఎత్తులో వున్న స్థలం, వాన నీళ్ళు చేరని స్థలంను ఎంపిక చేసుకోవాలి..రోజుకు ఒక గేదె లేక ఆవుకు 15 కిలోలు, దూడకు 5 కిలోలు సైలేజి ఇవ్వవచ్చు. వృత్తాకారపు సైలోల గోడలకు రాయి లేదా ఇటుక, ఇసుక, సిమెంట్ ఉపయోగించి కట్టి లోపలి వైపు సిమెంటు, ఇసుకతో అర అంగుళం మందము ప్లాస్టరింగ్ చేయవలసి ఉంటుంది. వీటి అడుగు భాగంలో నీళ్ళు ఇంకిపోవుటకు రాయి లేదా కంకర, సిమెంటును ఉపయోగించి కట్టాలి.. ఇందులోంచి వచ్చే నీళ్లు పోయేలా ఏర్పాటు చేసుకోవాలి..

సైలేజి తయారు చేయడానికి ఉపయెగించే మేతను కోసి పొలంలోనే ఒక రోజు అరేస్తే మంచిది. మేతను అర అంగుళం నుండి ఒక అంగుళం పొడవునకు కత్తిరించవలెను. ఆ మేతను రెండు చేతులతో బాగుగా బిగించి పట్టుకొని నిదానంగా చేతులను సడలిస్తే ఆ మేత 3-4 భాగాలు విడిపోవాలి. పొడిపొడిగా విడిపోతే దానికి నీళ్ళు చిలకరించి సైలేజి చేయాలి. అది ముద్దగా అయితే ఆ మేతను కొంత సమయం ఆరబెట్టి తరువాత కత్తిరించవలెను. ప్రతి 6 నుండి 9 అంగుళాల తరువాత, కాళ్ళతో కాని, చిన్న సైలేజర్ల సహాయంతో మేతను తొక్కవలెను..100 కిలోల సైలెజికి 200 గ్రాముల ఉప్పును కూడా కలపవలెను..

ఇకపోతే మేత మాగడానికి 3 నెలలు పడుతుంది. కావలసినంత సైలేజి తీసుకొని ప్లాస్టిక్ పేపరును గాలి ఆడకుండా కప్పివేయాలి.పాలు పితికిన తరువాత సైలేజి నివ్వండి. లేదా పాలు పితుకు సమయానికి మూడు, నాలుగు గంటలు ముందుగానే సైలేజి ఇవ్వండి.. లేకుంటే ఆ పాలల్లో వాసన వస్తుంది.. పైన చెప్పిన పద్ధతుల ద్వారా నిల్వ చెయ్యొచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news