ప్రభాస్​కు అనుష్క ఛాలెంజ్​.. రెబల్ స్టార్ స్వీట్ రిప్లై

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన తాజా చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. నవీన్‌ పొలిశెట్టి ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమాకు పి.మహేష్‌బాబు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ సెప్టెంబర్‌ 7 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అనుష్క సోషల్ మీడియాలో ఓ కొత్త ప్రచారానికి తెరలేపింది. ఈ సినిమాలో చెఫ్ పాత్రలో నటించిన అనుష్క తనకు ఇష్టమైన  వంటకం తయారీ విధానాన్ని ట్విటర్‌లో షేర్‌ చేసి ..#MSMPRecipeChallenge పేరుతో ఓ కొత్త ఛాలెంజ్‌ను మొదలుపెట్టింది.

మంగుళూరు చికెన్‌ కర్రీ, నీర్‌ దోశ ఎలా చేయాలో తెలుపుతూ అనుష్క ట్వీట్‌ చేసింది. ఇప్పుడు ఇష్టమైన వంటకాన్ని ఎలా తయారు చేస్తారో ప్రభాస్‌  పోస్టు పెట్టాలంటూ అతడిని ట్యాగ్‌ చేసిందీ బ్యూటీ. ఈ ఛాలెంజ్​ను స్వీకరించిన ప్రభాస్.. తనకు రొయ్యల పులావ్‌ అంటే ఇష్టమని ఆ వంటకం తయారీని పోస్టు చేశాడు. తాను ఈ ఛాలెంజ్‌ను రామ్‌ చరణ్‌కు విసురుతున్నట్లు చెప్పాడు.

‘నాకు స్వీటీ (అనుష్క) ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. కానీ తనకు ఇష్టమైన ఫుడ్‌ ఏంటో ఇప్పుడే తెలిసింది. నేను తన ఛాలెంజ్‌ను తీసుకున్నాను. అలాగే నాకు ఇష్టమైన రొయ్యల పులావ్‌ను ఎలా చేయాలో మీతో పంచుకున్నాను. రామ్ చరణ్‌ దీన్ని కొనసాగించాలని కోరుకుంటున్నా’ అంటూ అతడిని ట్యాగ్‌ చేశాడు. అలాగే అభిమానులు కూడా వారికి ఇష్టమైన వంటకాలను పంచుకోవాల్సిందిగా ప్రభాస్‌ కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version