నేడు జగన్ తో చిరంజీవి సమావేశం..భేటీకి ఎన్టీఆర్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో ఇవాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సమావేశం కానున్నారు. ఈ సమావేశం ఉదయం 11 గంటల సమయంలో జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున సహా పలువురు సినీ హీరోలు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఈ సమావేశానికి రానున్నట్లు తెలుస్తోంది.

నిర్మాతలు నష్టపోకుండా టికెట్ల ధరలను పెంచాలని టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిని కోరనున్నారు. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ కూడా టికెట్ల ధరలు పెంచాలని ప్రాథమిక సిఫారసులు చేసినట్లు సమాచారం అందుతోంది.

పరిశ్రమ ప్రతిపాదనలు, కమిటీ సిఫారసుల పై సినీ ప్రముఖులతో సీఎం జగన్ చర్చించనున్నారు. ఎంత మేర టికెట్ల ధరలను పెంచాలని దానిపై అభిప్రాయాలు తీసుకుంటారని తెలుస్తోంది. మొత్తానికి ఇవాళ టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సీఎం జగన్ శుభవార్త మాత్రం చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య టికెట్ల వివాదం గత కొన్ని నెలల నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news