ఆ బాలీవుడ్ హీరోతో కియారా..హాట్ పిక్స్ వైరల్

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ” భరత్ అనే నేను” చిత్రంతో ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తన నటనతోనే కాకుండా గ్లామర్ తో కూడా ఆకట్టుకుంది. అయితే చాలా కాలంగా కియారా అద్వానీ, సిద్ధార్థ మల్హోత్రా ప్రేమించుకుంటున్నారని.. పెళ్లికి కూడా సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల వీరి వివాహం డిసెంబర్లో ఘనంగా జరగనుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా వీరిద్దరూ సోమవారం రాత్రి ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సోమవారం రాత్రి ఈ జంట నిర్మాత అశ్విని యార్డి పుట్టినరోజు వేడుకలో సందడి చేశారు.

ఈ వేడుకలో కియారా తెల్లటి బ్యాక్ లెస్ క్రాప్ టాప్ ధరించి బంగారు రంగులు మెరిసే స్కర్ట్ లో మెరిసింది. ఆమె పక్కన సిద్ధార్ద్ మల్హోత్రా హల్టర్ క్రాప్ టాప్ లో కనిపించారు. ఈ పార్టీకి వీరితోపాటు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, కార్తీక్ ఆర్యన్, ఆయుష్ శర్మ, హిమేష్ రేష్మియా, తుషార్ కపూర్ మరియు చాలామంది హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version