పొన్నియన్ సెల్వన్ 2 రిజల్ట్ ముందే ఊహించి ఆ విషయంలో చేతులెత్తేసిన చిత్ర బృందం!

-

ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం చాలా ఏళ్లపాటు ప్రయత్నించి తెరకెక్కించిన చిత్రం పాన్నియన్ సెల్వం. ఈ సినిమా కథ తమిళులు దశాబ్దాల నుంచి చాలా గొప్పగా చెప్పుకుంటూ వస్తున్న నవల. ఇంత అద్భుతమైన నవల ఆధారంగా సినిమా తెరకెక్కించాలని ఎందరో ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నంలో ముందుకు వచ్చిన దర్శకుడు మణిరత్నం. కాగా గత ఏడాది విడుదలైన పార్ట్ వన్ పర్వాలేదు అనిపించిన ఇప్పుడు పరిస్థితి మాత్రం పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తుంది.

గత ఏడాది విడుదలైన పోన్నియన్ సెల్వం సినిమా మంచి హిట్ టాక్ అందుకుంది. కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమా తమిళ వెర్షన్ మంచి హిట్ అయినప్పటికీ తెలుగులో మాత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షక ఆదరణ పొందలేకపోయింది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను జీర్ణించుకోలేక సీరియల్లో ఉందంటూ సెటైర్లు సైతం వేశారు. కాగా ఇప్పుడు ‘పొన్నియన్ సెల్వన్-2’ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ పార్ట్ కు అనుకున్న స్థాయిలో ఆదరణ దక్కలేదని చెప్పాలి.

ఈ శుక్రవారం విడుదల కానున్న పొన్నియన్ సెల్వం పార్ట్ 2 సినిమా పైన ఎవరికీ పెద్ద ఆసక్తి లేనట్టే తెలుస్తోంది. ఈ విషయం ఇప్పటికే అర్థమైనప్పటికీ పరిస్థితి మాత్రం మరి దయనీయంగా మారడం ఇబ్బంది కలిగించే విధంగా ఉంది. పార్ట్ వన్ లో మధ్యలో ఆగిపోయిన కథ ఏమైందని ఆసక్తి కూడా లేకుండా జనాలు ఈ సినిమాపై ఏమాత్రం అంచనాలు పెట్టుకోలేదు. తాజాగా విడుదలైన ట్రైలర్ సైతం ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోవడంతో మణిరత్నం ఈ సినిమాని అనుకున్న స్థాయిలో తీయలేదని తెలుస్తుంది.

కాగా ముందే జరిగిన ఒప్పందం ప్రకారం దిల్ రాజు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ఆయన కానీ మణిరత్నం కానీ మిగతా టీం కానీ తెలుగులో ప్రమోట్ చేయడం కూడా వేస్ట్ అన్నట్లుగా సైలెంట్గా ఉంటోంది. తెలుగు అనే కాదు హిందీ వెర్షన్కు కూడా ఏమాత్రం బజ్ కనిపించడం లేదు. చిత్రాన్ని ప్రమోట్ చేయడం కూడా వేస్ట్ అన్న విధంగా ఉన్న చిత్ర బృందాన్ని చూసి టాలీవుడ్ బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ సినిమాపై పెద్దగా హోప్స్ లేవంటూ చేతులెత్తేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version