మెగా భేటీ : ఆల్ ద బెస్ట్ చిరు.. అండ్ అద‌ర్స్

-

ఇవాళ మెగాస్టార్ చిరు మ‌రియు ఇంకొంద‌రు టాలీవుడ్ ప్ర‌ముఖులు ఏపీ సీఎం జ‌గ‌న్ తో భేటీ అయ్యారు.ఈ సంద‌ర్భంగా టికెట్ ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ ప్ర‌భుత్వం ఇచ్చిన ఉత్త‌ర్వుపై పునఃస‌మీక్షించుకోవాల‌ని కోరుతూ టాలీవుడ్ త‌ర‌ఫున పెద్ద‌లు విన్న‌విస్తున్నారు.

చ‌ర్చ‌ల‌కు ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు రాజ‌మౌళి, కొర‌టాల శివ, యువ హీరోలు మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్‌, అలీ, న‌ట‌,ద‌ర్శ‌కులు ఆర్. నారాయ‌ణ మూర్తి, పోసాని కృష్ణ‌ముర‌ళి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క అంశాల‌పై చిత్ర ప‌రిశ్ర‌మ ప్రముఖులు త‌మ విన్న‌పాన్ని సీఎం దృష్టికి తీసుకుని వెళ్ల‌నున్నారు. ఇవాళ్టితో వివాదం సామర‌స్యంగా ముగిసిపోతుంద‌ని తాము భావిస్తున్నామ‌ని చిరు తో స‌హా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ కూడా ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రికొద్ది సేప‌ట్లో చ‌ర్చ‌ల సారాంశం ఏంట‌న్న‌ది మీడియాకు చిరు వెల్ల‌డించ‌నున్నార‌ని స‌మాచారం. చ‌ర్చ‌ల‌కు ప్ర‌భుత్వం త‌ర‌ఫున స‌మ‌న్వ‌యక‌ర్త‌గా సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news