క్రేజీ కాంబో..‘విరాట పర్వం’ దర్శకుడితో పవన్ కల్యాణ్ మూవీ!

-

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ‘విరాట పర్వం’ మూవీ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. నక్సలిజం నేపథ్యంలో లవ్ స్టోరిగా తూము సరళ జీవిత చరిత్రను చక్కగా తెరకెక్కించారు వేణు.

రానా, సాయిపల్లవి ఈ ఫిల్మ్ లో జంటగా నటించారు. వేణు ఊడుగుల స్వయంగా కవి అవడంతో పాటు దర్శకుడిగా తన ప్రతిభను చక్కగా ప్రదర్శించారని సినిమా చూసిన ప్రతీ ఒక్కరు ప్రశంసిస్తున్నారు. కాగా, ఈ సినిమా కంటే ముందే వేణు ఊడుగుల పవర్ స్టా్ర్ పవన్ కల్యాణ్ కు ఓ స్టోరి లైన్ వినిపించారని టాక్.

ప్రజెంట్ సినిమాలు, పాలిటిక్స్ రెండూ చేస్తున్న పవన్ కల్యాణ్ తనకున్న బిజీ టైమ్ లో ‘విరాట పర్వం’ దర్శకుడితో సినిమా చేస్తారా? లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. త్వరలో యాక్టివ్ పాలిటిక్స్ లో ఫుల్ బిజీ కానున్న పవన్ కల్యాణ్..ఆ లోపు ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వేణు ఊడుగుల దర్శకత్వంలో సినిమా చేస్తారో లేదో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news