రాంచరణ్‌కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు బొమ్మ!

-

గ్లోబల్ యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగాపవర్ స్టార్ రాంచరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. త్వరలోనే మేడమ్‌ టుస్సాడ్స్‌లో చెర్రీ మైనపు విగ్రహం ఏర్పాటు కానుంది.ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు రాంచరణ్‌ను సంప్రదించినట్లు సమాచారం. అయితే, తెలుగులో ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులకు సంబంధించిన మైనపు విగ్రహాలను టుస్సాడ్స్ ఏర్పాటు చేసింది.

తాజాగా రాంచరణ్ విగ్రహాన్ని సింగపూర్‌లోని మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. చెర్రీతో పాటు ఆయన పెంపుడు శునకం ‘రైమీ’ విగ్రహాన్ని కూడా పెట్టనున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తి అయ్యిందని, తాజాగా జరిగిన ఐఫా వేదక మీద టుస్సాడ్స్‌ టీమ్‌ ప్రకటించింది. అది కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. టుస్సాడ్స్‌ ఫ్యామిలీలో భాగం కావడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు చరణ్‌ పేర్కొన్నారు.కాగా, స్టార్‌ హీరోలు ప్రభాస్‌‌, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాలు మేడమ్‌ టుస్సాడ్స్‌‌లో కొలువుదీరిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version