అల్లు అర్జున్ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్య’..మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్లే..!

-

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్-ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఫస్ట్ పిక్చర్ ‘ఆర్య’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుకుమార్ కు ఇది తొలి చిత్రం. కాగా, ఈ సినిమా స్టోరి అప్పటికే చాలా మంది స్టార్ హీరోలకు సుకుమార్ వినిపించారు. చివరకు బన్నీ ఓకే చేయడంతో సినిమా స్టార్ట్ అయింది.

‘ఆర్య’ మూవీ స్టోరిని సుకుమార్ తొలుత ‘దిల్’ షూటింగ్ సమయంలో నితిన్ కు చెప్పాడు. ఫస్ట్ హాఫ్ విని చాలా బాగుందన్న నితిన్.. సెకండాఫ్ విన్నాక అంతగా పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదట. దాంతో ఈ స్టోరిని తర్వాత దిల్ రాజుకు వినిపించాడు. దిల్ రాజుకు నచ్చింది కానీ, కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పాడట. అలా పక్కకు పెట్టినా.. స్టోరి బాగుందని దిల్ రాజు చివరకు సుకుమార్ చెప్పాడు.

ఆ తర్వాత ఈ సినిమా ఎవరికి అయితే బాగుంటుందని ..సుకుమార్, దిల్ రాజు చర్చించుకుంటున్నారు. అలా వాళ్లు పిక్చర్ స్టోరిని ప్రభాస్ కు వినిపించారు. స్టోరి బాగానే ఉందని అన్న ప్రభాస్, ఆయన స్నేహితులు..ఆది ప్రభాస్ కు సూట్ అవుతుందా? అని ప్రశ్నించారు.

అప్పటికే ప్రభాస్ ‘ఈశ్వర్’, ‘రాఘవేంద్ర’ సినిమాలు చేసి ‘వర్షం’ మూవీ చేస్తున్నాడు. ఇక ఆ తర్వాత ‘ఆర్య’ స్టోరిని రవితేజకు వినిపించారు. ఆయనకు స్టోరి బాగా నచ్చింది. కానీ, ఆ స్టోరి తనతో కాకుండా నితిన్ లాంటి వారితో చేస్తే బాగుంటుందని రవితేజ చెప్పాడట. అలా అంత మంది స్టార్ హీరోలు ఈ సినిమా స్టోరి మిస్ చేసుకున్నారు.

ఇక ఆ తర్వాత ‘దిల్’ సినిమాను టాలీవుడ్ యంగ్ హీరోలకు ప్రీమియర్ వేయగా, అక్కడకు బన్నీ రాగా, ఆయన్ను చూసి తన సినిమాకు సూట్ అవుతాడని దిల్ రాజు, సుకుమార్ అనుకున్నారు. తర్వాత బన్నీకి స్టోరి చెప్పగా ఓకే చేశాడు.

అలా చివరకు ఈ స్టోరిని అల్లు అరవింద్, చిరంజీవిలకు చెప్పిన తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక రిలీజ్ తర్వాత ఈ ‘ఆర్య’ సినిమా ట్రెండ్ సెట్టర్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news