వరంగల్ : సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

-

సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరువు మండలం రుద్రారం గ్రామ శివారులో భారీగా గంజాయి పట్టుబడింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రంపచోడవరం నుండి కర్ణాటక రాష్ట్రానికి MH22R 2200 నెంబరు గల షిఫ్ట్ డిజైర్ కారులో 224 కేజీల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.44 లక్షల 80 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న నిందితులు కారు వదిలి వెళ్లిపోయినట్లు వారు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version