ind vs sa : నేడు సౌతాఫ్రికాతో మూడో వన్డే…టీమిండియా పరువు నిలబెట్టుకునేనా ?

-

ఇవాళ సౌతాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య చిట్ట చివరి మ్యాచ్‌ జరుగనుంది. ఈ మూడో వన్డే మ్యాచ్‌ న్యూ లాండ్స్‌ లోని కేప్‌ టౌన్‌ స్టేడియంలో జరుగుతుంది. అలాగే.. ఈ మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక ఇప్పటికే సిరీస్‌ గెలిచిన ఉత్సాహంతో దక్షిణాఫ్రికా జట్టు ఉండగా… టీమిండియా మాత్రం ఆత్మ విశ్వాసం పూర్తిగా కోల్పోయి… కకా వికలం అవుతోంది. ఇవాళ్టి మ్యాచ్‌ ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుంది టీమిండియా.

జట్ల అంచనా
ఇండియా : కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్), సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, ఆర్ అశ్విన్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్

సౌతాఫ్రికా : జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్, టెంబా బావుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్‌రామ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, సిసంద మగల, తబ్రైజ్ షమ్సీ

Read more RELATED
Recommended to you

Latest news