BREAKING NEWS: మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్

-

కరోనా థర్డ్ వేవ్ లో అనేక మంది రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నిన్న రాత్రి స్వల్ప లక్షణాలు ఉండగా.. టెస్ట్ చేయించుకున్నానని కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నట్లు చిరు వెల్లడించారు. తనను కలిసివాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. త్వరలోనే మీ అందరిని కలుస్తా అని అన్నారు.

ఇదిలా ఉంటే కరోనా థర్డ్ వేవ్ మొదలయ్యాక పలువురు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, త్రిష, కీర్తి సురేష్, శోభన, మీనా, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో పాటు కోలీవుడ్ పరిశ్రమ నుంచి విక్రమ్, వడివేలు, కమల్ హాసన్, సత్యరాజ్ వంటి వారికి కరోనా సోకింది. ప్రస్తుతం వీరంతా కరోనా నుంచి కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news