టీవీలు చూడటం ఈ మధ్య మానేశా.. అందుకే : జగ్గారెడ్డి

-

టీ కాంగ్రెస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నిన్నటి వరకు భుజంభుజం తడుముకొని తిరిగిన నాయకులు తెల్లారేసరికి ఎడముఖం పెడముఖం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలు తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అయితే వీరి అస్పష్టతతో విపక్షాలకు మేలు జరిగే విధంగానే కనిపిస్తోంది. ఈ రోజు టీపీసీసీ రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించారు. రేవంత్‌ రెడ్డి పర్యటనకు అక్కడి కాంగ్రెస్‌ నేతలే కాకుండా, భువనగిరి ఎంపీ, స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కూడా డుమ్మా కొట్టారు.

అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీపీసీసీగా ఉన్న వ్యక్తి రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లవచ్చునన్నారు. కానీ.. నాకు కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో తెలియదని, కావాలంటే.. టీఆర్ఎస్‌, బీజేపీ పార్టీ గురించి మాట్లాడుతానన్నారు. అంతేకాకుండా టీవీలు చూడటం ఈ మధ్య మానేశా.. అందుకే ఏం జరుగుతుందో తెలియడం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version