రాహుల్ ‘ భారత్ న్యాయ యాత్ర ‘ తో ప్రధాని ఇంజిన్ ఆగిపోవడం ఖాయం -సీఎం రేవంత్ రెడ్డి

-

రాబోయే లోక్ సభ ఎన్నికలలో విజయం సాధించి దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నాగపూర్ లో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో రేవంత్ రెడ్డి బిజెపి పై తీవ్ర విమర్శలు చేశారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజుల భారత్ జోడోయాత్ర రాహుల్ గాంధీ చేయడం వలన కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ భారత్ న్యాయాయాత్ర చేయనున్నారని తెలిపారు. ప్రతి మెడిసిన్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుందని …. నరేంద్ర మోడీ అనే మెడిసిన్ కి కూడా ఎక్స్పైరీ డేట్ ముగిసిందని చెప్పారు.

లోక్సభలో రాహుల్ గొంతు విప్పడంతో అదాని ఇంజిన్ ఆగిపోయి షెడ్డు కు వెళ్లిందని అన్నారు. ఇప్పుడు భారత్ న్యాయ యాత్రతో ప్రధాని మోడీ ఇంజన్ కూడా ఆగిపోవడం తథ్యం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా దేశం కోసం కాంగ్రెస్ విజయం కోసం 100 రోజులు పనిచేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version