హైదరాబాద్ ప్రయాణికులకు అలర్ట్​..ఇవాళ 34 MMTS సర్వీసులు రద్దు

-

హైదరాబాద్ నగర ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌. ఇవాళ హైదరాబాద్​లో ఎంఎంటీఎస్​ రైళ్లను భారీగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆదివారం అంటే ఇవాళ 34 ఎంఎంటీఎస్​ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది దక్షిణ మధ్య రైల్వే.

లింగంపల్లి-ఫలక్​నుమా రూట్‌లో 9 సర్వీసులు రద్దు కాగా.. హైదరాబాద్-లింగంపల్లి రూట్‌లోనూ 9 సర్వీసులు రద్దైనట్లు తెలిపింది. ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్‌లో 7 సర్వీసులు రద్దు కాగా.. లింగంపల్లి-ఫలక్ నుమా రూట్‌లో 7 సర్వీసులు రద్దు చేసినట్లు పేర్కొంది.

లింగంపల్లి – సికింద్రాబాద్ రూట్‌లో ఒక్క సర్వీసు రద్దు మాత్రమే రద్దు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. నిర్వహణ సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికులకు స్వల్ప అంతరాయం కలుగుతోందని చెప్పింది. ఇవాళ ఒక్కరోజు ప్రయాణికులు సర్దుకోవాలని తిరిగి సోమవారం యథావిధిగా ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తాయని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version