Breaking : సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు

-

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు రానున్నారు. కొలీజియం సిఫారసుతో రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కేంద్రం పంపిన ప్రతిపాదనలకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. సుప్రీంకోర్టుకు నూతన న్యాయమూర్తులకు సంబంధించి కొలీజయం గతంలోనే కేంద్రానికి సిఫారసు చేసింది. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో తాజా నియామకానికి మార్గం సుగమం అయింది. ఈ నిర్ణయంతో పంకజ్ మిట్టల్ (రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్), సంజయ్ కరోల్ (పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్), పీవీ సంజయ్ కుమార్ (మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్), అహ్సానుద్దీన్ అమానుల్లా (పాట్నా హైకోర్టు న్యాయమూర్తి), మనోజ్ మిశ్రా (అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి) త్వరలోనే సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా అడుగుపెట్టనున్నారు.

సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం సిఫారసులను కేంద్రం చాలారోజులుగా పెండింగ్‌లో పెట్టింద. దీనిపై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది. ఈ విషయాన్ని విచారించిన జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ ఏఎస్‌ ఓకాతో కూడిన ధర్మాసనం ముందు అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి హాజరై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలిపారు. ఐదుగురు న్యాయమూర్తులను అతి త్వరలో నియమిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఇది చాలా సీరియస్‌ అంశమని, కేంద్రం తీవ్ర కాలయాపన చేయటం సరికాదని పేర్కొన్నది. న్యాయస్థానానికి అసౌకర్యం కలిగించే పని చేయరాదని సూచించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులను నియమించింది.

Read more RELATED
Recommended to you

Latest news