BREAKING : టీడీపీ నేత చంద్రయ్య హత్య కేసులో 8 మంది అరెస్ట్

-

గుంటూరు వెల్దుర్తి మండలం గుండ్లపాడు లో టిడిపి నాయకుడు చంద్రయ్య హత్యకేసులో 8 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు ప్రధాన కారణం పాత తగాదాలు అని మా ప్రాధమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. మృతుడు తోట చంద్రయ్య మరియు చింతా శివ రామయ్య గుండ్లపల్లి గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని.. 3 సంవత్సరాల క్రితం మృతుడు తోట చంద్రయ్య మరియు ముద్దాయి చింతా శివ రామయ్య మధ్య వారి ప్రాంతంలో వేసే సిమెంట్ రోడ్డు విషయంలో మధ్య గొడవలు జరిగాయని పోలీసులు వివరించారు.

అప్పటినుండి వారి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని తెలిసిందని.. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన గ్రామంలో తమ బంధువుల వేడుక కు హాజరైన తోట చంద్రయ్య, చింతా శివరామయ్యను చంపుతానని చెప్పాడని ప్రచారం జరిగిందన్నారు… చంద్రయ్య ను చంపాలని శివరామయ్య, తన కుమారుడు మరియు 6 గురు అనుచరుల సహాయంతో నిన్న హత్య చేయడం జరిగినదని.. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య చేసారని మా దర్యాప్తులో తేలిందని పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఆ నిందితులను త్వరలోనే కోర్టులో హాజరు పరుచనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news