బీజేపీ పార్టీలో చేరిన టాలీవుడ్ నటుడు

-

భారతీయ జనతా పార్టీలో తాలూరు ప్రముఖులు సంజయ్ రాయిచుర చేరారు. హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షం లో బీజేపీ లో చేరారు టాలీవుడ్ సినీ నటుడు సంజయ్ రాయిచుర. ఆచార్య, మహర్షి సినిమాల్లో నటించిన సంజయ్…. పలు దక్షిణ భారత సినిమాల్లో, సీరియళ్ళలో నటించారు.

నరేంద్ర మోదీ గారి విజన్, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాల పట్ల ఆకర్షితుడినై బీజేపీ లో చేరుతున్నానని సంజయ్ తెలిపారు. సంజయ్ చేరిక బీజేపీ నీ మరింత బలోపేతం చేస్తుంది అని ఈటల రాజేందర్ తెలిపారు. సంజయ్ తో పాటు బిజెపిలో చేరిన వారిలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కర్ణాటక మాజీ సిఎస్ రత్నప్రభ కూడా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news