ఆదిపురుష్ విడుదల: ప్రతి థియేటర్ లో ఒక సీటు ఆయనకే అంకితం…

-

ప్రభాస్ మరియు కృతిసనన్ జంటగా శ్రీరాముడు మరియు సీత పాత్రలలో నటిస్తున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు వరుస పరాజయాల తర్వాత ప్రభాస్ కు ఎలాగైనా హిట్ ను అందించాలని కసిగా సినిమాను పూర్తి చేశారు. ఇప్పటికే ప్రకటించిన ప్రకారం జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ రిలీజ్ కానుంది. కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న ప్రతి థియేటర్ లో ఒక సీటును శ్రీరామ పరమ భక్తుడు హనుమంతుడి కోసం కేటాయించనున్నారు. పురాణాల ప్రకారం ఎక్కడైతే శ్రీరాముని పారాయణం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటారన్నది మన నమ్మకం.

అందుకే ఈ సినిమా రిలీజ్ అయ్యే ప్రతి థియేటర్ లో ఒక సీటును మాత్రమే ఆయనకు అంకితం ఇవ్వాలని చిత్ర బృందం మహత్తరమైన నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version