ఏపీ ఉపాధ్యాయులకు షాక్.. మే 20 వరకు సెలవులన్నీ రద్దు

-

ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ సెలవులు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల మే 20 తేదీ వరకు సెలవులను రద్దు చేస్తున్నట్లు జగన్ సర్కార్ ఆదివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎమర్జెన్సీ మాత్రమే సెలవులు పెట్టుకునేందుకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగా రాష్ట్రంలో ఏప్రిల్ 27వ తేదీ నుంచి కీలకమైన పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

మే 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు కొనసాగుతాయి. ఈ క్రమంలో ఉపాధ్యాయులకు సెలవులను రద్దు చేస్తున్నట్లు… రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పదోతరగతి పరీక్షలు ముగిసిన తర్వాత కూడా ఉపాధ్యాయులు పాఠశాలలకు కచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రంలోని పాఠశాలలకు మే ఆరో తేదీ నుంచి 23వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యా శాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది. జులై 4వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో మే 20వ తేదీ తర్వాత ఉపాధ్యాయులకు సెలవులు అధికారికంగా అందుబాటులోకి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news