లోకేష్ రాజకీయాలకు పనికిరాడు…చంద్రబాబుకు ఏ దిక్కులేదు : అంబ‌టి రాంబాబు

-

చంద్రబాబు ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని… లోకేష్ రాజకీయాలకు పనికిరాడంటూ మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు అంబటి రాంబాబు. చంద్రబాబు ఎందుకు వెక్కి వెక్కి‌ఏడ్చారని…నిజమైన నాయకుడు ఏడవరంటూ చుర‌క‌లు అంటించారు. ధీరుడికి మాత్రమే రాజ్యం ఏలే హక్కు ఉంటుందని… చంద్రబాబుకు‌ కుటుంబం ప్రధానం కాదు, ముఖ్యమంత్రి పదవే ప్రధానమ‌ని ఎద్దేవా చేశారు అంబ‌టి రాంబాబు. కుప్పంలోనే చంద్రబాబుకు దిక్కులేదు… ఇక అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. ఓటీఎస్ పథకంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు అంబటి రాంబాబు.

ప్రస్తుత రాజకీయాలు మారిపోయాయని..గతంలో అగ్రవర్ణాలకు ప్రాధాన్యత ఉండేదన్నారు అంబటి రాంబాబు. సీఎం జగన్ బడుగు, బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని.. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలన్నదే సీఎం జగన్ లక్ష్యమ‌ని తెలిపారు. చంద్రబాబు ఉన్నోళ్లకు‌ డబ్బులు పంచితే జగన్ పేదలకు డబ్బులు ఇస్తున్నారని..అమ్మ ఒడి, రైతుభరోసా వంటి అనేక పథకాలు సీఎం జగన్ ప్రవేశపెట్టారని పేర్కొన్నారు అంబటి రాంబాబు.

Read more RELATED
Recommended to you

Latest news