దారుణం.. కేరళ బీచ్‌లో అమెరికా మహిళపై అత్యాచారం

-

భారత్‌కు వచ్చిన అమెరికా మహిళ‌పై(44) ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తొలుత మహిళకు నిందితులు మద్యం ఇచ్చారు. ఆమె మత్తులో కూరుకుపోయాక తమతో పాటూ బైక్‌పై మరో చోటుకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నిందితులను అరెస్ట్ చేశారు.

బాధిత మహిళ ఇటీవలే అమెరికా నుంచి కేరళకు వచ్చినట్లు సమాచారం. కొంత కాలంగా ఆమె ఒక ఆశ్రమంలో నివసిస్తోంది. ఈ విషయమై పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించారు. నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్లు కరునాగపల్లి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. అమెరికా మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన జూలై 31న జరిగిందని పోలీసులు తెలిపారు. ఆశ్రమం సమీపంలోని బీచ్‌లో ఆ మహిళ ఒంటరిగా కూర్చున్నదని, ఈ సమయంలో ఇద్దరు యువకులు మహిళ వద్దకు వచ్చి ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం.. కామాంధులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version