అమ‌రావ‌తి : కోర్టు బోనులో జ‌గ‌న్ ? ఏం  జ‌రిగిందంటే !

-

రైతులు న‌ష్ట‌పోయాక ప్ర‌భుత్వం ఆదుకోవాలి.ఆ రోజు రైతులు న‌ష్ట‌పోయినా కూడా రాజ‌ధానికి భూములు ఇస్తున్నామన్న ఆనందం ఒక‌టి వారిలో ఉంది.ఆనందం అనే క‌న్నా సంతృప్తి వారిలో ఉంది. రాజ‌ధాని నిర్మాణ క్ర‌మంలో తామొక భాగం అవుతున్నామ‌న్న సంతృప్తిలో భాగంగా ఆ రోజు ప్ర‌భుత్వానికి భూములు ఇచ్చారు.ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి.భూముల‌ను ప్ర‌భుత్వానికి రైతులు ఇచ్చారు కానీ టీడీపీకి కాదు.ఆ వేళ భూముల విష‌య‌మై సేక‌ర‌ణ పేరిట లేదా స‌మీక‌ర‌ణ పేరిట కొంత గంద‌ర‌గోళం నెల‌కొన్నా కూడా చంద్ర‌బాబు మాత్రం వెన‌క్కు త‌గ్గ‌కుండా తాను అనుకున్న విధంగానే భూమి తీసుకున్నారు.

వైసీపీ మాత్రం న‌ష్ట‌పోయిన రైతుల విష‌య‌మై ఏనాడు ఓ స‌ర్వే చేయించ‌డం కానీ వారితో మాట్లాడడం కానీ చేయ‌లేదు. ఆ రోజు ప్ర‌భుత్వం భూమి తీసుకున్నందుకు ప‌రిహారం కొంత అంతేకాకుండా భూమికి బ‌దులు భూమి (రాజ‌ధాని నిర్మాణంలో భాగంగా  ప్లాట్ల రూపంలో కానీ క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్సుల రూపంలో కానీ అభివృద్ధి చేసిన భూమి) ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.ఆ విధంగా పూలింగ్ అన్న‌ది సులువుగానే ముగిసిపోయింది.పెద్ద‌గా ఆర్థిక భారం లేకుండానే ప్ర‌భుత్వం తాను అనుకున్న విధంగా రాజ‌ధాని నిర్మాణానికి భూములు సేక‌రించింది. తరువాత వ‌చ్చిన వైసీపీ ఇవ‌న్నీ మ‌రిచిపోయి కొంత ప్ర‌తిష్టంభ‌న నెల‌కొనే విధంగా 3 రాజ‌ధానుల డ్రామా న‌డిపింది.ఆఖ‌రికి ఇవాళ హైకోర్టు తీర్పు వ‌చ్చింది.

దాని ప్ర‌కారం…
రాజధాని అవసరాలకు తప్ప
ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదు : హైకోర్టు

ఇది చాలా అంటే చాలాముఖ్య‌మ‌యిన విష‌యం.ఇప్ప‌టిదాకా ప్ర‌భుత్వం చేసిన త‌ప్పిదాల్లో ఇది కూడా ఒక‌టి.స‌రిగా ఆదాయం లేని కార‌ణంతో రాజ‌ధాని భూములను ఇష్టం వ‌చ్చిన విధంగా తాక‌ట్టు పెట్టాల‌ని,త‌ద్వారాఅప్పులు తేవాల‌ని ప‌రిత‌పించారు.ఆవిధంగా కొన్ని ప్ర‌య‌త్నాలు కూడా స‌ఫ‌లీకృతం అయ్యాయి.ఆ రోజు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అభివృద్ధి చేసిన రాజ‌ధాని భూముల‌ను కొన్ని రియ‌ల్ వెంచ‌ర్లుగామార్చి అమ్మేందుకు కూడా జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌య‌త్నాలు చేసింది.కొన్నింటిని బ్యాంకుల‌లో త‌న‌ఖా పెట్టేందుకు ఉన్న అన్ని దారుల‌నూ న్యాయ ప‌ర ఇబ్బందులు లేకుండా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించింది.ఆ విధంగా దీన్నొక ఆర్థిక వ‌న‌రుగా చూసింది.

ఇప్పుడు హై కోర్టు మాత్రం ఇందుకు స‌సేమీరా అంటోంది.స‌రైన నిర్ణ‌యం తీసుకుని న‌డుచుకోవాల‌ని, అంతేకానీ రాజ‌ధాని అవ‌స‌రాల‌కు కాకుండా రాజ‌కీయ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ప్ర‌వ‌ర్తించ‌వ‌ద్ద‌ని చెబుతోంది.దీంతో ఈ వివాదం మ‌రింత పెర‌గ‌నుంది.ఇప్ప‌టికే రాజధాని భూముల‌ను త‌న‌ఖా ఉంచి రెండు వేల కోట్ల‌కు పైగా అప్పులు తెచ్చింద‌న్న వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో వాటిపై ప్ర‌భుత్వం ఏం చెబుతుందో అన్న‌ది కూడా తేలాలి.
– పొలిటిక‌ల్ ఎఫైర్స్ – మ‌న‌లోకం ప్ర‌త్యేకం 

Read more RELATED
Recommended to you

Latest news