2029కి కూడా చంద్రబాబు.. పోలవరం పూర్తి చేసేలా లేడు – అంబటి రాంబాబు

-

చంద్రబాబు మాటలు చూస్తుంటే 2029 కి కూడా పోలవరం పూర్తి చేసేలా లేదంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు రిలీజ్ చేసిన పోలవరం శ్వేతా పత్రం పైన స్పందించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా.. స్పిల్ వే పూర్తి చేసింది మేమే అన్నారు అంబటి రాంబాబు.

వైయస్ జగన్ గారి పాలనలో చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేశాం… చంద్రబాబు ధోరణి చూస్తుంటే.. వైయస్ఆర్ గారి కొడుకు వైయస్ జగన్ గారే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసేలా ఉన్నారని చెప్పారు అంబటి రాంబాబు. చంద్రబాబుకి ఎంతసేపు వైయస్ జగన్ గారిపై బురద చల్లాలనే తాపత్రయమే తప్ప.. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలని అతనికి ఏ కోశానా లేదని ఆగ్రహించారు. చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందాని ఆరోపణలు చేశారు.  కేవలం కమీషన్లు దండుకోవడానికే కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును మేమే కట్టుకుంటాం అని చంద్రబాబు ప్రభుత్వం తీసుకుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version