ఆ ప్రచారాలను కొట్టి పారేసిన ఏపీ పోలీసులు..!

-

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో, కీలక నేతల అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఈ కేసులో ఇప్పటికే కొంతమంది కీలక నేతలను అదుపులోకి తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆ ప్రచారాలను కొట్టి పారేస్తున్నారు పోలీసు అధికారులు. హైదరాబాద్, బెంగళూరు, లాంటి ప్రాంతాలకు కొన్ని టీంలు వెళ్లినట్లుగా చెబుతున్న పోలీసులు.. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్ ల కదలికలపై నిఘా పెట్టారు. అయితే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిపిన వారి కదలికలపై నిగాపెట్టామని,కేసులో ఉన్న అందరిని అరెస్టు చేస్తామని అంటున్నారు పోలీసులు. అలాగే ఇప్పటివరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదని చెబుతున్నారు పోలీసులు.

అయితే టీడీపీ కేంద్ర కార్యాలయంలో దాడి ఘటనపై ముందస్తు బెయిల్ పిటిషన్ లు దాఖలు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న 40 మంది ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు గుంటూరు జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version