2024లో మళ్లీ సీఎంగా జగన్ అధికారంలోకి వస్తారు – బాలినేని

-

వచ్చే ఎన్నికల్లో గత మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం..సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావటం ఖాయం అన్నారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రకాశంలో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ…ప్రతీ పేదవారు సీఎం జగన్ ను గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారు..2024లో మళ్లీ సీఎంగా జగన్ అధికారంలోకి వస్తారన్నారు.

Balineni about 2024 elections

నాకు దాచుకునే అలవాటు లేకపోవటం వల్లే అన్నీ మాట్లాడేస్తున్నా..నిన్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఓ స్నేహితుడితో జరిగిన పందెం గురించి మాట్లాడానని వివరించారు. మా అబ్బాయి బీఆర్ఎస్ గెలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారని పందెం వేయలేదని చెప్పా..సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో టీడీపీ పూసుకుని, రాసుకుని ఉండటం వల్ల కాంగ్రెస్ ఓడిందన్నారు. ఆ ప్రాంతాల్లో టీడీపీ బలపరిచిన వ్యక్తులు ఓడారు కాబట్టి ఇక్కడ అదే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేశారు. టీడీపీ వాళ్లు ఎంత రోడ్ల మీదకు వచ్చినా ప్రజలు వైసీపీ వెంటే ఉన్నారన్నారు. వైసీపీ… సీఎం జగన్ నాయకత్వంలో సింగిల్ గా పోటీ చేస్తుంది..అసలు టీడీపీ, జనసేన పార్టీలకు నైతికత ఉందా అని ప్రశ్నించారు బాలినేని.

Read more RELATED
Recommended to you

Exit mobile version