Tirupathi: పద్మావతి అమ్మవారి ఆలయంలో 8 ఏళ్ల బాలుడు మిస్సింగ్….!

-

Tirupathi: తిరుమల తిరుపతి సన్నిధిలో బాలుడు మిస్సింగ్ కలకలం రేపింది. తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయంలో 8 ఏళ్ల బాలుడు మిస్సింగ్ అయ్యాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయంలో బాలుడు మిస్సింగ్ అయ్యాడు. అమ్మవారి దర్శనానికి వచ్చింది కర్ణాటక రాష్ట్రం పావుగడకు చెందిన నవీన్ కుమార్ కుటుంబం.

Boy missing from Padmavati temple in Tiruchanur

ఈ తరుణంలోనే… తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయం గేట్ నెం.3 దగ్గర తప్పి పోయాడు నవీన్ కుమారుడు గౌతమ్ (8). ఎంత వెతికినా నవీన్ కుమారుడు గౌతమ్ (8) ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు కుటుంబ సభ్యులు. దీంతో గౌతమ్ కోసం గాలిస్తున్నారు తిరుచానూరు పోలీసులు. తప్పిపోయాడా ..! లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా..! అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version