జగన్ పాలనలో న్యాయం జరగడం లేదు : బ్రదర్ అనిల్ సంచలనం

-

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై బ్రదర్ అనిల్ షాకింగ్ కామెంట్స్ చేశారు.. తన మాట మేరకు 2019లో వైసీపీ విజయంకు కారకులైన వర్గాలకు.. జగన్ పాలనలో న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల బాధలు వినేందుకు ఉత్తరాంధ్రకు వచ్చానని బ్రదర్ అనిల్ స్పష్టం చేశారు.

రాజకీయ పార్టీ పెట్టాలనే డిమాండ్ అన్ని సంఘాల నుంచి ఉంది… పార్టీ ఏర్పాటు సాధారణమైన విషయం కాదు…దానిపై కసరత్తు చేసి చెబుతామని పేర్కొన్నారు బ్రదర్ అనిల్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కోరతాను అని వెల్లడించారు.

ఆయన చాలా బిజీగా ఉంటున్నారు… నేను కలిసి రెండున్నరేళ్లు అయింది…అంటూ బ్రదర్ అనిల్ చెప్పుకొచ్చారు. సమస్యల పరిష్కారం కోసం రిప్రజంటేషన్ ఇస్తాం….సీఎం జగన్ మోహన్ రెడ్డిని నేను నేరుగా కలవాల్సిన అవసరం లేదన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం జరుగుతుంది…సిబిఐ చిన్న సంస్థ కాదన్నారు. వాళ్ళు టేకప్ చేస్తే దోషులు శిక్షించబడతారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news