నేడు శ్రీపెరుంబుదూరుకు చంద్రబాబు

-

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో బిజీగా ఉన్నారు. ఓవైపు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూనే మరోవైపు ఆలయాలు సందర్శిస్తున్నారు. ఇటీవలే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న చంద్రబాబు ఇవాళ తమిళనాడు వెళ్లనున్నారు.

అక్కడ కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూరుకు వెళ్లి శ్రీ రామానుజర్ ఆలయాన్ని సందర్శించనున్నారు. స్వామి వారిని దర్శించుకుని పూజలు చేయనున్నారు. ఈ విషయాన్ని చెన్నై నగర టీడీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 2.30కు హైదరాబాద్‌ బేగంపేట నుంచి విమానంలో బయలుదేరి చంద్రబాబు చెన్నై విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీపెరుంబుదూరు ఆలయాన్ని చేరుకుంటారు. దర్శనం తర్వాత సాయంత్రం చెన్నై చేరుకుని రాత్రి 8.50కు విమానంలో విజయవాడ బయలుదేరనున్నట్లు వివరించారు.

మరోవైపు సోమవారం రోజున చంద్రబాబు నాయుడు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్​ను పరామర్శించారు. ఇటీవల ఎడమ తుంటి ఎముక విరగడంతో కేసీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ యశోద ఆస్పత్రికి వెళ్లిన చంద్రబాబు కేసీఆర్​ను పరామర్శించి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version