రక్షాబంధన్.. అక్కాచెల్లెళ్లకు చంద్రబాబు, పవన్ శుభాకాంక్షలు

-

దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి కన్నులపండువగా జరుగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అడపడుచులంతా పుట్టింటికి చేరుకుని తమ సోదరులకు రాఖీ కడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు రాఖీ శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా తెలుగింటి అక్కాచెల్లెళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతేనని అన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించింది.. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది టీడీపీనేనని వెల్లడించారు. డ్వాక్రా సంఘాలతో మహిళా సంక్షేమానికి కృషి చేశామని.. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఆడపడుచులకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. సోదర సోదరి ప్రేమ అనుభవైక్యంతోనే అర్థమవుతుందని.. అక్కా చెల్లెమ్మల అనురాగానికి ఏమిస్తే రుణం తీరుతుందని అన్నారు. సోదర సోదరీమణుల అనురాగానికి ప్రతీక ఈ రాఖీ పండుగ అని పవన్ కల్యాణ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version