ఏపీ ప్రజలకు జగన్ తీపికబురు.. 5.05 లక్షల మందికి ఇండ్లు !

-

ఏపీ ప్రజలకు జగన్ తీపికబురు చెప్పారు. డిసెంబర్ 21న రాష్ట్రవ్యాప్తంగా 5.05 లక్షల APSHCL & APTIDCO ఇళ్ళను ప్రారంభించనున్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇల్లుపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని, ఈ ఇళ్లలో మౌలిక సదుపాయాల కల్పన పనులను అత్యంత నాణ్యతతో చేపట్టాలని సూచనలు చేశారు. ఇప్పటికే పనులు పూర్తయిన వాటిని లబ్ధిదారులకు అందిస్తున్నామని సీఎంకు అధికారులు వివరించారు.

టిడ్కో ఇళ్ల నిర్వాహనపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. నవరత్నాలు-పేదలందరికీ ఇల్లు పథకానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది అన్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news