వివేకాను ఎవరు చంపారో సీఎం జగన్‌కు తెలుసు – డిఎల్ రవీంద్రా

-

వివేకానంద రెడ్డి హత్య కేసు పై మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు హంతకులు, సూత్రధారులు ఎవరో త్వరలోనే సిబిఐ బయట పెడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున అది తేలిన తర్వాత అన్ని విషయాలు బహిర్గతం అవుతాయని తెలిపారు.

శనివారం వైయస్సార్ జిల్లా కాజీపేటలో తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వివేకాను ఎవరు చంపారో, ఎవరు చంపించారో సీఎం జగన్ కు తెలుసు అని చెప్పారు. హంతకుల వివరాలను సిబిఐ అధికారులు బయట పెట్టక ముందే ముఖ్యమంత్రి అసలు హంతకుల వివరాలను వెల్లడిస్తే మంచి పేరు వస్తుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించడానికి ఆయన ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి ని ఎంపీ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పావుగా వాడుకున్నారని ఆరోపించారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ కేసు తేలిన తర్వాత సిబిఐ తాడేపల్లి ప్యాలెస్ ను సిబిఐ విచారిస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version