చంద్రబాబు సింపతి సభ కాదు…అది పిక్నిక్ సభ – గుడివాడ అమర్నాథ్‌

-

చంద్రబాబు సింపతి సభ కాదు…అది పిక్నిక్ సభ అని ఎద్దేవా చేశారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌. నిన్న హైదరాబాద్ లో జరిగిన చంద్రబాబు సింపతి సభపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ స్పందించారు. చంద్రబాబును అరెస్టు చేశారన్న బాధ ఎవరికి లేదని.. నిన్నటి సభకు బాలకృష్ణ ఎందుకు రాలేదు తెలియదని చురకలు అంటించారు.

టిడిపికి తెలంగాణలో అంత బలం ఉంటే, తెలంగాణ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని నిలదీశారు. దమ్ముంటే తెలంగాణ ఎన్నికల్లో టిడిపి పోటీ చేయాలని..ఆ పార్టీకి ఉన్న బలం ఏంటో చూపించాలని చురకలు అంటించారు. 370 కోట్ల రూపాయల స్కాంలో జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించడానికి వెళ్లిన పవన్ కళ్యాణ్….కాపులపై జరుగుతున్న దాడులను ఎందుకు అడ్డుకోవడం లేదని నిలదీశారు. మంత్రి అంబటి రాంబాబుకు కాపు సామాజిక వర్గం అండగా ఉంటుందని చెప్పారు. 34 సంవత్సరాలుగా అంబటి రాంబాబు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి…అలాంటి వ్యక్తిపై దాడి చేస్తే ఊరుకునేది లేదు…అంబటికీ మేమంతా అండగా ఉంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version