గుంటూరు కోర్టు సంచలన తీర్పు…బాలికను రేప్‌ పాస్టర్‌ కు 20 ఏళ్ల జైలు శిక్ష !

-

Guntur POCSO Court announced the verdict: గుంటూరు పోక్సో కోర్టు…సంచలన తీర్పు ప్రకటించింది. ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన, పాస్టర్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది గుంటూరు పోక్సో కోర్టు. 2017 నవంబర్ 18 న ప్రార్థనల కోసం అని పిలిచి, మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు పాస్టర్ నీలం కోటేశ్వరరావు. ఈ తరుణంలోనే తీవ్ర అనారోగ్యానికి గురై, గర్భవతిగా మారింది మైనర్ బాలిక.

Guntur POCSO Court announced the verdict

ఇక బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో, కేసు నమోదు అయింది. ఈ కేసును పోలీసులు విచారణ చేసి.. పాస్టర్ నీలం కోటేశ్వరరావును అరెస్ట్‌ చేశారు. ఇక విచారణ లో నిందితుడు పాస్టర్ నీలం కోటేశ్వరరావు అత్యాచారం చేశాడని తేలింది. ఈ కేసు రుజువు కావడంతో గుంటూరు పోక్సో కోర్టు…సంచలన తీర్పు ప్రకటించింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష ,లక్ష రూపాయల జరిమానా విధిస్తూ, తీర్పు చెప్పింది గుంటూరు పోక్సో కోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version