ఏపీ ఉద్యోగులకు జగన్ శుభవార్త..పీఆర్సీ 5 ఏళ్లకు తగ్గింపు !

-

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. నిన్న ఏపీ ఉద్యోగులతో.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, మంత్రి వర్యులు బొత్స సత్య నారాయణ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీ అంశంపై ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దేదుకు మంత్రుల కమిటీ ప్రయత్నం చేసిందని.. అనుమానాలు నివృత్తితో పాటు కొన్ని సర్దుబాటు చేశామని ప్రకటన చేశారు.

jagan

కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఉన్నా ఉదారంగానే ఉద్యోగుల కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. చాలా అంశాల్లో ఉద్యోగ సంఘాలు అంగీకారానికి వచ్చాయని భావిస్తున్నామని.. మళ్ళీ కలిసి పనీ చేస్తామని స్పష్టం చేశారు. పీఆర్సీని 5 ఏళ్లకు తగ్గించే అంశాన్ని అంగీకారాన్ని తెలిపామని.. ఐఆర్ రికవరీ చేయకూడదని అడిగారు అంగీకరించామని ప్రకటన చేశారు సజ్జల రామకృష్ణ రెడ్డి. దీనిపై ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేద న్నారు. ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.మరోమారు చర్చలు జరిపి అపోహలు తొలగించే ప్రయత్నం చేస్తామని ప్రకటన చేశారు  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version