జగన్‌ మా మాట వింటే ఈ ప్రమాదం వచ్చేది కాదు – కాటసాని

-

Katasani Rambhupal Reddy On Jagan: జగన్‌ మా మాట వింటే ఈ ప్రమాదం వచ్చేది కాదంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో ముఖ్య కార్యకర్తలతో పాణ్యం మాజీ ఎంఎల్ఏ కాటసాని రాంభూపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాణ్యం మాజీ ఎంఎల్ఏ కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ…. నేను ఒక్కడినే ఓడి పోలేదు.

Katasani Rambhupal Reddy On Jagan

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రమంతా ఓడి పోయామన్నారు. మా సీఎం జగన్, అధికారులు మా మాట విని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వెల్లడించారు పాణ్యం మాజీ ఎంఎల్ఏ కాటసాని రాంభూపాల్ రెడ్డి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ మా కొంప ముంచిందన్నారు. అది వద్దే వద్దని మేము ఎంత మొత్తుకున్నా ఎవరూ మా మాట పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు పాణ్యం మాజీ ఎంఎల్ఏ కాటసాని రాంభూపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version