టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తా: కేశినేని నాని

-

టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. విజయవాడ ఎంపీ టికెట్‌ ఇవ్వబోమని చంద్రబాబు చెప్పినట్లు నిన్ననే విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. ఇక తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని మరో ప్రకటన చేశారు. త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. ‘అందరికీ నమస్కారం. టీడీపీకి నా అవసరం లేదని చంద్రబాబు భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు అని నా భావన.

త్వరలోనే ఢిల్లీ వెళ్లి నా ఎంపీ పదవికి రాజీనామాను ఆమోదించుకొని….ఆ మరుక్షణం టీడీపీకి రాజీనామా చేస్తానని తెలియజేస్తున్నా’ అని సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి దొంగా, అంటూ ఓ వర్గం మీడియా తెలంగాణ ఎన్నికల్లో ఏదేదో ప్రచారం చేసింది…ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి సీఎం అయి కూర్చున్నాడు, మీడియా ఏం పీకగలిగిందని చురకలు అంటించారు. 2024 మే వరకూ నేనే విజయవాడ ఎంపీని…. నా రాజకీయ భవిష్యత్తు ఏంటో విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారన్నారు కేశినేని నాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version