పేర్ని నాని, ఆయన కొడుకు అక్రమ తవ్వకాలు చేస్తున్నారు – కొల్లు రవీంద్ర

-

పేర్ని నాని, ఆయన కొడుకు అక్రమ తవ్వకాలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. కైకలూరులో పేర్ని నాని అక్రమ చెరువుల కోసమే కలెక్టర్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని.. నిషేధిత భూముల్లో పేర్ని యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు చేశాడని ఆగ్రహించారు.

అడ్డు రాకుండా కలెక్టర్ ను జడ్పీ మీటింగ్ ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని.. ఓట్లు వేసిన బందరు ప్రజలకోసం సీఎం ఇంటిముందు ఎందుకు ధర్నా చేయలేదు, జి+3 ఇళ్లకోసం ఇందుకోసం ధర్నా చేయలేదు ? అని నిప్పులు చెరిగారు కొల్లు రవీంద్ర.

బందరులో పేర్ని కొడుకు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించడం కనిపించలేదా ? కలెక్టర్ మీద మీరు పిర్యాదు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు మీ మీద పిర్యాదు చేస్తన్న విషయం కనిపించడం లేదా అని నిలదీశారు. గడచిన నాలుగున్నారా సంవత్సరాలుగా పేర్ని నాని ఎన్నిసార్లు బందరులో పర్యటించారు, ఎన్ని సమస్యలు పరిష్కరించారని నిలదీశారు. పవన్ కళ్యాణ్ , చంద్ర బాబు, లోకేష్ తిట్టడం తప్ప నువ్వు బందరు ప్రజలకు సాధించినది ఏంటి చెప్పాలని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version