రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి – అచ్చెన్నాయుడు

-

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. టిడిపి కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్య సాయి జిల్లా బత్తలపల్లిలో వైసీపీ నేతల దాడిలో టిడిపి కార్యకర్త సాకే రామయ్య మృతి బాధాకరం అన్నారు. పల్నాడులో ఉన్నం లక్ష్మీనారాయణ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆయన ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు.

” అధికార మదంతో వైసిపి నేతలు ప్రతిపక్ష టిడిపి నాయకులు, కార్యకర్తలపై డమనకాండకు పాల్పడుతూనే ఉన్నారు. సత్య సాయి జిల్లా బత్తలపల్లి లో వైసీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో చేసిన దాడిలో టిడిపి కార్యకర్త సాకే రామయ్య మృతి చెందడం అత్యంత బాధాకరం. వైసీపీ నేతల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. వ్యక్తి మరణానికి కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న జగన్ రెడ్డి.. తమ అవినీతి, అక్రమాలను, విధ్వంసాన్ని ప్రశ్నించిన టిడిపి నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా భౌతిక దాడులు చేస్తూ హతమారుస్తున్నారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి అనేందుకు రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలే నిదర్శనం” అన్నారు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version