తెలుగు రాష్ట్రాల ముస్లింలకు కేసీఆర్, జగన్ శుభాకాంక్షలు

-

తెలుగు రాష్ట్రాల ముస్లింలకు కేసీఆర్, జగన్ శుభాకాంక్షలు చెప్పారు. మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవమైన “మిలాద్ ఉన్ నబీ” ని పురస్కరించుకొని ముస్లింలకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సర్వమానవ సమానత్వం, శాంతి స్థాపనే లక్ష్యంగా సాగిన మహ్మద్ ప్రవక్త బోధనలతో స్ఫూర్తి పొందాలన్నారు. దేశంలో శాంతి, సామరస్యాలను పెంపొందించేందుకు మరింతగా కృషి జరగాలని సీఎం అన్నారు.

ఇక అటు ఏపీ సీఎం జగన్‌ కూడా ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత, ప్రపంచ శాంతి మహ్మద్ ప్రవక్త మానవాళికి ఇచ్చిన గొప్ప సందేశాలు. మహ్మద్ ప్రవక్త పుట్టినరోజు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముస్లిం సోదరసోదరీమణులందరికీ శుభాకాంక్షలు. అల్లాహ్ దీవెనలతో అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నానని పేర్కొన్నారు జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news