బుడమేరు మళ్లీ కొట్టుకు పోతుందనేది అసత్య ప్రచారం..!

-

బుడమేరు మళ్లీ కొట్టుకు పోతుందని సోషల్ మీడియాలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా ప్రచారం చేస్తున్నారు అని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రస్తుతం విజయవాడలో వరద బాదితుల పరిస్దితులు మెరుగయ్యాయి. ఓ ముఖ్యమంత్రిగా బాదితుల కోసం నాలుగు గంటలు జేసీబీ మీద ప్రయాణించిన చిత్తశుద్ది మా సీఎందే. వైసీపీ అధినేత ఎక్కడికైనా వెళ్లి బాదితులకు సహాయం చేశారా. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సాయం చేశారో అందరూ చూశారు. నోరుంది కదా అని మాట్లాడటం.. సొంత పేపర్లు, మీడియా ఉన్నాయి కదా అని ఏదంటే అది రాయటం సరికాదు. ఐదేళ్లు ఆడుకున్నారు.

గతంలో సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే అరెస్టులు చేశారు. మీరు రెచ్చగొట్టి రెచ్చిపోయి ప్రవర్తించినా ఇంతకీ మించి ముందుకు సాగలేరు. ప్రజలు అన్నీ గమనించే తీర్పు ఇచ్చారు. సీఎంగా ఉన్నప్పుడు కూడా జగన్ భాద్యతగా ఒక్కపని చేయలేదు. చేసిన తప్పుల మీదే కొంత మంది వైసీపీ నేతలు కేసులు ఎదుర్కొంటున్నారు.. చట్ట ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి.. అక్రమాలు ఎక్కడా జరగలేదు. తప్పనిసరిగా అన్నీ మెడికల్ కళాశాలలు కొనసాగిస్తాం. హడావుడిగా మసిబూసి మారేడు కాయ చేశారు. మీరు చేసిన తప్పులు అన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అని మంత్రి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version