అధికారులు నిజాయితీగా లేకపోతే క్రిమినల్ కేసులే..!

-

గుంటూరు జిల్లా వ‌ల్ల‌భాపురంలో గ్రామ స‌భ‌లో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. ప్ర‌జ‌ల నుండి వ‌చ్చిన అర్జీలు స్వీక‌రించి, వాటి పరిష్కారానికి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసారు. త్రాగునీరు, పెన్షన్, ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం, మందుల సమస్యలు, మురుగు నీటి స‌మ‌స్య‌ల‌ను మంత్రి మనోహ‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చారు గ్రామ‌స్తులు. అయితే అవినీతి లేకుండా పంచాయితీ వ్యవస్థని బలోపేతం చేసుకునే విధంగా గ్రామ సభలు జరగాలి అని నాదెండ్ల మ‌నోహ‌ర్ అన్నారు.

గతంలో స్పీక‌ర్‌గా ఉన్న తాను కోట్లాది రూపాయ‌ల‌తో తెనాలి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాను. గ్రామాల అభివృద్దే గ్రామ సభల‌ ముఖ్య ఉద్దేశం అని తెలిపిన మంత్రి.. మూడు నెలల్లోనే నిధులు తీసుకువచ్చి గ్రామాల అభివృద్ధి పనులు చేపడతాము అని పేర్కొన్నారు. అలాగే నిజాయితీగా పని చెయ్యని అధికారులపై క్రిమినల్ కేసులు పెడతాం అని హెచ్చరించారు. అలాగే రైతులు ఎవ్వరు అధైర్యపడొద్దు.. యూరియా కంపనీలలో తనిఖీలు చేస్తున్నాం. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా రైతులకు అందుబాటులో ఉంచుతాం అని నాదెండ్ల మ‌నోహ‌ర్‌ భరోసా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version