భర్త సెల్వమణీ వివాదంపై స్పందించిన మంత్రి రోజా

-

విశాఖ : దక్షిణాది సినీ కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు సెల్వమణీ కాంట్రవర్సీ కామెంట్స్ పై స్పందించారు మంత్రి రోజా. నా భర్త వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు.. ఏ రాష్ట్రానికి సంబంధించిన కార్మికులు ఆ రాష్ట్రం లోనే పని చేసేలా ఉంటే అందరికీ ఉపాధి లభిస్తుందని సెల్వమని ఉద్దేశం అని పేర్కొన్నారు రోజా.

విశాఖ లో షూటింగ్స్ చేయమని ప్రభుత్వం అడిగినా సినీ ప్రొడ్యూసర్స్ ఎందుకు చేయడం లేదు… తెలుగుదేశంలో ఉన్న నటులు, ప్రొడ్యూసర్లు ఏమయ్యారు..!? అని ప్రశ్నించారు.

ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్న వారు ఇక్కడ ఇళ్ళు కూడా ఎందుకు కట్టుకోలేదని స్పష్టం చేశారు మంత్రి రోజా. పోటీ అయినా పోరాటం అయిన సింహంలా సింగిల్ గా రావడానికి జగన్ సిద్ధం…నువ్వు,నీ కొడుకు అందుకు సిద్ధమా…? 2024లో చంద్రబాబును బాదేయడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నారు.
దొంగపనులు,లంగా పనులు మానక పోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news