వైయస్ రాజశేఖర్ రెడ్డి చావుకు కారణం సోనియాగాంధీనే – డిప్యూటీ సీఎం సంచలనం

-

ఏపీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళ లోకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని…వై.ఎస్ ఆర్ చావుకు సోనియా గాంధీ నే కారణం అయ్యిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులు తో నాడు జగన్ మోహన్ రెడ్డి ని జైలుకు పంపించిందని సోనియా గాంధీ పై నిప్పులు చెరిగారు.

చంద్రబాబు మ్యని ఫెస్తోలో ఎన్నో వాగ్ధానాలు చేశాడు.. ఏది అమలు చేయలేదు..గడప గడపకు ఇంటికి వెళ్తుంటే ప్రతి కుటుంబం స్వాగతీస్తోందని పేర్కొన్నారు. ఎల్లో మీడియా పప్పు బెల్లం పంచుతున్నారు అంటున్నారు,చంద్రబాబు ఏనాడైనా బిసిలను రాజ్యసభకు పంపించారా..? అని నిలదీశారు.

యాదవులను ఇద్దరు ఎంపీ లను రాజ్య సభ కు పంపించారు సీఎం జగన్ అని…సీఎం జగన్ మోహన్ రెడ్డి పై అసభ్య వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు శాడిస్ట్ కు పుట్టి ఉంటాడని విమర్శలు చేశారు. ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలను నీవు అధికారం లోకి వేస్తే తీసేస్తవా.. ఎల్లో మీడియా చెప్పాలి…నీవు అధికారం లో ఉంటే..ఎన్ని రోడ్లు వేశావో చెప్పు అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. కాంట్రాక్టర్ లకు వచ్చే నెల 8 లోపు బిల్లులు ఇస్తారు..పేదలు నాడి తెలుసుకున్న వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news