లారీ అతివేగమే నెల్లూరు రోడ్డు ప్రమాదానికి కారణం – నెల్లూరు జిల్లా ఎస్పీ

-

నెల్లూరు జిల్లా కావలి రోడ్డు ప్రమాద ఘటనపై నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి స్పందించారు. ఈ రోడ్డు ప్రమాదానికి ఐరన్ లోడుతో వెళ్తున్న లారీ అతివేగంతో వెళ్ళటమే కారణమని గుర్తించామని… అతివేగంతో స్పీడ్ కంట్రోల్ కాక ప్రమాదం జరిగిందన్నారు.

Fatal road accident in Nellore district 7 dead

ఈ ఘటనలో రెండు లారీలు, బస్సు డ్రైవర్లతో సహా ఆరుగురు మృతి చెందారని వివరంచారు. మృతులను గుర్తించి బంధువులకు సమాచారం అందించామని…సహాయక చర్యల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని తెలిపారు. సహాయక చర్యల కోసం 9440796383 నంబర్ తో కంట్రోల్ రూం లో సంప్రదించవచ్చు..ప్రమాదానికి గల కారణాలు విచారణ చేస్తున్నామన్నారు.

లారీని క్లీనర్ నడిపారా లేక డ్రైవర్ నడిపారా అనేది విచారణలో తేలుతుంది..ఇప్పటి వరకు క్షతగాత్రులను, మృతులను ఆస్పత్రులకు తరలించే పనిలో నిమగ్నమయ్యామని వివరించారు నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి. ఈ ఘటనపై పూర్తి వివరాలు విచారణ అనంతరం అతిత్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version