కిడ్నాప్ చేసిన రౌడీలతోనే విశాఖ ఎంపీ ములాఖత్ అయ్యారు – పవన్‌ కళ్యాణ్‌

-

విశాఖ ఎంపి ఎంవీవీ సత్యన్నారాయణపై పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన రౌడీషీటర్లతోనే ఎంపీ ములాఖత్ అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఇంట్లో వాళ్ల అఘాయిత్యానికి పాల్పడిన వాళ్ళను చూసి భయపడతారేంటి..? డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసిన వాళ్లే ఇలా వ్యవహార స్తారని మండిపడ్డారు పవన్‌ కళ్యాణ్‌.

ఈ వ్యవహారం ఎంపీ ఇంటికి పరిమితం కాదు కేంద్రం దృష్టికి తీసుకుని వెళతామని.. పాస్ పోర్టు కావాలంటే పోలీసు వేరిఫికేషన్ ఉండాలి…..వాలేంటీర్ల నియామకంలో ఆ పద్ధతి ఎందుకు పాటించడం లేదని మండిపడ్డారు. నవరత్నాల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రయివేట్ సేన కావొచ్చు కానీ జనం ప్రాణాలు తీసేస్తామంటే ఎలా….? అని నిలదీశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదువు తప్పాయన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నేరాలకు పాల్పడుతున్నారమని.. హ్యూమన్ ట్రాఫికింగ్ ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువగా జరుగుతోందని ఆరోపణలు చేశారు పవన్‌ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version