పవన్ కళ్యాణ్ ఓ కుంభకర్ణుడు.. 3 ఏళ్ళకు నిద్ర లేచాడు – వెల్లంపల్లి

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు మాజీ మంత్రి వెల్లంపల్లి. మూడేళ్ళు కుంభకర్ణుడుగా పవన్ కళ్యాణ్ నిద్రపోయాడా ?? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు జనవాణి తెలియదు…ధన వాణి మాత్రమే తెలుసు అని విమర్శించారు. డబ్బులు తీసుకుని చంద్రబాబు, బీజేపీ, కమ్యూనిస్టులు, ఇతర రాష్ట్రాల పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని.. అడ్రస్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అగ్రహించారు. ఒక్క పది రోజుల ఏపీలో నిద్ర తీసి ఆ తర్వాత రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడాలని మాజీ మంత్రి వెల్లంపల్లి చురకలు అంటించారు.

అలాగే వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసారు మాజీ మంత్రి వెల్లంపల్లి. పోలవరం నుంచి ఈ మూడేళ్లలో ఏం చేశాం అనే అంశాల ప్రదర్శన ఉంటుంది.. ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు చెప్పాలని ప్రజలు ప్లీనరీకి రానున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరు 8, 9 తేదీలు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తున్నారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతో ఉంటే తప్పేంటి?? అని నిలదీశారు. అప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుంది.. పనికి మాలిన ఎమ్పీ మాటలను, పకోడి రామకృష్ణ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. ఎన్నికల సమయంలోనే జగన్ రాజకీయాలు అని పేర్కొన్నారు. మిగిలిన సమయంలో ప్రజల, రాష్ట్ర అభివృద్ధి పైనే దృష్టి పెడతారు..

Read more RELATED
Recommended to you

Latest news